27-07-2025 12:11:52 AM
న్యూఢిల్లీ, జూలై 26: భారత్ తమకు అ త్యంత కీలక భాగస్వామి అని మాల్దీవుల అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు పేర్కొన్నారు. శనివారం ద్వీపదేశం మాల్దీవుల 60వ స్వా తంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. భారత ప్రధానితో ప్రత్యేకంగా సమావే శం అయిన తర్వాత మయిజ్జు భారత్ను, ప్ర ధాని మోదీని కొనియాడారు. ‘సుదీర్ఘకాలం గా మాల్దీవులకు భారత్ అత్యంత సన్నిహిత, కీలక భాగస్వామిగా ఉంటోంది.
భద్రత, వా ణిజ్యం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి అనేక రంగాల్లో ఇరు దేశాల నడుమ పరస్పర సహకారం కొనసాగుతోంది. ఎలాంటి విపత్తులు, సంక్షోభాలు ఎదురైనా భారత్ మా దేశానికి అండగా నిలిచి ఆపన్నహస్తం అందించింది’ అని అన్నారు. ప్రధాని మోదీతో ప్రత్యేక విం దు అనంతరం మోదీ నాయకత్వాన్ని కొనియాడారు.
4,078 రోజుల పాటు ప్రధాని పదవిలో కొనసాగడం గొప్ప మైలురాయి అని, ప్రజాసేవ, దేశప్రజల పురోగతి, శ్రేయస్సుపై మోదీ అంకితభావం గొప్పదన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ మాల్దీవుల ఉపాధ్యక్షుడు లతీఫ్తో భేటీ అయ్యారు. మా ల్దీవుల పర్యటన ముగించుకున్న అనంతరం ప్రధాని మోదీ తమిళనాడులోని తూతుక్కుడికి బయల్దేరారు.
వికసిత్ తమిళనాడు నిర్మిద్దాం
తూతుక్కుడి: తమిళనాడులోని తూతుక్కుడిలో శనివారం ప్రధాని మోదీ రూ. 4,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అక్కడ జరిగిన బహిరంగసభలో మోదీ మాట్లాడుతూ.. ‘ప్రపంచదేశాలకు భా రత్పై పెరుగుతున్న విశ్వాసానికి ఇది ప్రతీక. ఇదే ఆత్మవిశ్వాసంతో మనం వికసిత్ భారత్, వికసిత్ తమిళనాడును నిర్మిద్దాం’ అని పేర్కొన్నారు. తూతుక్కుడిలో కొత్త వి మానాశ్రయ టెర్మినల్ భవనానికి, పలు రైల్వే ప్రాజెక్టులు, హైవే ప్రాజెక్టులు మొదలైన వాటికి శంకుస్థాప చేశారు.