22 June, 2026 | 2:21 AM

భారత మహిళలదే హాకీ నేషన్స్ కప్

22-06-2026 12:50 AM

న్యూజిలాండ్‌కు షాక్

ఆక్లాండ్, జూన్ 21: ఆసియా క్రీడలకు ముందే భారత మహిళల హాకీ జట్టు దుమ్మురేపింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మ క ఎఫ్‌ఐహెచ్ నేషన్స్ కప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆతిథ్య న్యూజిలాండ్‌ను 2 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. భారత్ ఈ ట్రోఫీ గెలవడం వరుసగా ఇది రెండోసారి. తుది పోరులో భారత్ తరపున నవ నీత్ కౌర్, సునేలిటా టొప్పొలు చెరొక గోల్ సాధించారు.

ఫైనల్లో అద్బుతం గా రాణించిన ఫార్వర్డ్ లల్రేమ్సియామి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికైంది. టోర్నీ ఆసాం తం గొప్పగా ఆడిన దీపిక ఆరు గోల్స్‌తో అమెరికా ప్లేయర్ అష్లే సెస్సాతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును పంచుకుంది. కాగా భారత మహిళల జట్టు విజయాన్ని అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.