17-08-2025 12:05:45 AM
- రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం
- త్వరలోనే కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు
- పంచాయతీ రాజ్శాఖ మంత్రి సీతక్క
చేవెళ్ల, ఆగస్టు 16: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజా పాలన అందిస్తున్నామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. తమ ప్రభు త్వం సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్లలా ముం దుకు తీసుకెళ్తోందన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన, రైతులకు రైతు భరోసా, పేద లకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ ఒక వైపు, రోడ్లు, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఇంకోవైపు జరుగుతోందని చెప్పారు.
శనివారం చేవెళ్ల మం డలం ముడిమ్యాల నుంచి మల్కాపుర్ వర కు రూ. 3.35 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డుకు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో మెయిన్ రోడ్డు నుంచి గ్రామానికి రూ.1.30 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. తంగడపల్లి గ్రామంలో అభయాంజనేయస్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొని పూజ లు నిర్వహించారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తు న్నామని, ఇప్పటికే చాలా మంజూరు చేశామని, ఇందులో కొన్ని మోడల్ రోడ్స్ కాగా, కొన్నింటికి డైరెక్ట్ గా నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. అభివృద్ధి కోసమే ఎ మ్మెల్యే యాదయ్య సొంత గూటికి వచ్చారని, గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఫైనా న్స్ మినిస్టర్ తో మాట్లాడి. త్వరలో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి, చేవెళ్ల మా ర్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, దేవర వెంకట రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ వసంతం, మెంబర్ షాబాద్ దర్శన్, మహిళా కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గోనె సరిత రెడ్డి నేతలు కృష్ణారెడ్డి, గోనె శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్, రాములు, సాయినాథ, జనార్ధన్, రాంచంద్రయ్య, దర్శన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.