calender_icon.png 26 August, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

14-03-2025 12:22:25 AM

సమస్యలు పరిష్కరించంచాలని మున్సిపల్ కమిషనర్‌కు బీఆర్‌ఎస్ నాయకుడు జస్వంత్ వినతి

కుత్బుల్లాపూర్, మార్చి 13 (విజయ క్రాం తి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్‌ఎం సీలోని ప్రగతినగర్ స్మశాన వాటికలో సమ స్యలు పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్ సాబీర్ అలీని 6వ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షు డు ఉప్పు జస్వంత్ గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు.

స్మశాన వాటిక సమీపంలో నోటిస్ బోర్డులు ఏర్పాటు చేయాలని, అంత్య క్రియలు చార్జీల సమాచార నోటిస్ బోర్డు ఉంచాలని, నీటి వనరులు, వాచ్ మెన్ తదితర వసతులు, మరణం ధ్రువీకరణ పత్రాల కోసం రషీదు పుస్తకం మొదలగు సౌకర్యాలు కల్పిం చాలని కోరారు.

అలాగే నిజాంపేట్ మున్సిప ల్ కార్యాలయంలో అధికారుల పేర్లు, ఫోన్ నంబర్స్‌తో కూడిన చార్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని కమిష నర్‌ను కోరారు. కమిషనర్ ను కలిసిన వారిలో డివిజన్ యూత్ అధ్యక్షుడు సాయి కుమార్, ఎలీషా, మణికంఠ సాయి, మహేష్ తదితరులు ఉన్నారు.