16-06-2025 12:00:00 AM
జుక్కల్, జూన్ 15 (విజయక్రాంతి), కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద ఏడిగీ పెద్ద చెరువు కాలువ మరమ్మతు పనులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదివారం పరిశీలించారు. గత 20 సంవత్సరాలుగా ఈ కాల్వ మరమ్మతులకు నోచుకోలేదు. స్థానిక రైతులు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి తీసుకెళ్లారు. కాల్వ మరమ్మత పనులకు నిధులు మంజూరు చేయించారు.
పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. పెద్ద చెరువు ఆయకట్టు కింద 600 ఎకరాల పంట పొలాలు సస్యశ్యామలం కావడానికి ఈ కాల్వ మరమత్తు పనులు పూర్తయితే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.