16-06-2025 12:00:00 AM
తూప్రాన్, జూన్ 15 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు కార్మిక శాఖ మంత్రిగా, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జిగా స్థానం కల్పించినందుకు గజ్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, తూప్రాన్ మండల నాయకులైన జింక మల్లేశం, శ్రీకాంత్ రెడ్డిలు మంత్రి నివాస గృహంలో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా రానున్న స్థానిక సమరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరిచిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి గ్రామంలో ప్రజలకు సరైన రీతిలో పథకాలను తెలియజేయాలని కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.