20 March, 2026 | 6:50 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఇందల్వాయి మండలంలో తనిఖీలు

07-01-2026 03:23 PM

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు ఎస్సై సందీప్ హెచ్చరిక

ఇందల్వాయి,(విజయక్రాంతి): ఇందల్వాయి మండల కేంద్రంలో ప్రాణాంతకమైన చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నిషేధించాలనే లక్ష్యంతో ఇందల్వాయి ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాలు, గోదాములలో, అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

చైనా మాంజా వల్ల పక్షులు, జంతువులు మాత్రమే కాకుండా ద్విచక్ర వాహనదారులు, చిన్నారులు పౌరులుకూడా తీవ్ర ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై సందీప్ మాట్లాడుతూ, చైనా మాంజా అమ్మకం లేదా వినియోగం చట్టరీత్యా నేరం అని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.