13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఇందల్వాయి మండలంలో తనిఖీలు

07-01-2026 03:23 PM

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు ఎస్సై సందీప్ హెచ్చరిక

ఇందల్వాయి,(విజయక్రాంతి): ఇందల్వాయి మండల కేంద్రంలో ప్రాణాంతకమైన చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నిషేధించాలనే లక్ష్యంతో ఇందల్వాయి ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాలు, గోదాములలో, అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

చైనా మాంజా వల్ల పక్షులు, జంతువులు మాత్రమే కాకుండా ద్విచక్ర వాహనదారులు, చిన్నారులు పౌరులుకూడా తీవ్ర ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై సందీప్ మాట్లాడుతూ, చైనా మాంజా అమ్మకం లేదా వినియోగం చట్టరీత్యా నేరం అని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.