20 March, 2026 | 5:18 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

మైనర్లు వాహనాలను నడపొద్దు

07-01-2026 03:19 PM

కొమురవెల్లి,(విజయక్రాంతి): తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు నడపడానికి ఇవ్వొద్దని కొమురవెల్లి ఎస్ఐ మహేష్ అన్నారు. మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వాహనాన్ని నడిపేటప్పుడు భద్రతాపరమైన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు.

పిల్లలు వాహనాలు నడిపితే పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేగంగా వాహనాలను నడిపి ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా  విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.రమేష్ తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.