13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

మైనర్లు వాహనాలను నడపొద్దు

07-01-2026 03:19 PM

కొమురవెల్లి,(విజయక్రాంతి): తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు నడపడానికి ఇవ్వొద్దని కొమురవెల్లి ఎస్ఐ మహేష్ అన్నారు. మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వాహనాన్ని నడిపేటప్పుడు భద్రతాపరమైన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు.

పిల్లలు వాహనాలు నడిపితే పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేగంగా వాహనాలను నడిపి ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా  విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.రమేష్ తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.