ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన
06-05-2026 07:27 PM
పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
నాగోల్,(విజయక్రాంతి): మాన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. భక్తి భావంతో నిర్వహించే కార్యక్రమాలు ప్రజల్లో సానుకూల భావనను పెంచుతాయని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.






