2 May, 2026 | 9:09 PM

Breaking News

బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •  

అంతర్జాతీయ న్యాయవాదుల దినోత్సవ వేడుక

18-07-2025 09:21 AM
  1. బాల్యం నుండే లక్ష్యాన్ని ఎంచుకోవాలి
  2. సీనియర్ న్యాయవాదులు కొర్సా, పర్శిక

చర్ల, (విజయక్రాంతి): విద్యార్దులు బాల్య దశనుండే తాము సాదించుకునే లక్ష్యాలను నిర్దేసించుకోవాలని సీనియర్ న్యాయవాదులు కొర్సా కృష్ణార్జున్ రావు, పర్శిక సోమరాజు అన్నారు. అంతర్జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా చర్ల మండల న్యాయవాదుల సంఘం ఆద్వర్యంలో  వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం విద్యార్దులకు అరటిపండ్లు, యాపిల్, బత్తాయి పండ్లను పంపిణీ చేసారు. కేక్ కట్ చేసి విద్యార్దులకు మిఠాయిలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆదివాసీ విద్యార్దుల అభ్యున్నతి కొరకు చర్లలో విద్యార్ది నిలయం ఏర్పాటు చేయడం ఆదివాసీ సమాజానికే గర్వకారణమని అన్నారు. ప్రతి విద్యార్ది తాను పెద్దయిన తర్వాత ఏమి చేయాలో చిన్ననాటి నుండే నిర్దేసించుకొని అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పేద విద్యార్దుల అభ్యున్నతి కొరకు కృషిచేయాలన్నారు.

సంస్ద అందిస్తున్న అవకాశాలను సద్వినియోగపరుచుకొని ఉన్నత స్దితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సమయం వృదా చేసుకోకుండా చదువులపై దృష్టి సాదించాలని అన్నారు.‌ పాఠశాలలో ఉపాద్యాయులు బోదించే పాఠాలను శ్రద్దగా విని జీవితాలకు సార్దకత చేకూర్చుకోవాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంకు ముఖ్య అతిదిగా హాజరయిన గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అద్యక్షుడు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ వనవాసీ సంస్దతో పాటు దాతలు అందచేస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్ ను తీర్చిదిద్దుకోవాలని పేర్కొన్నారు. ‌వనవాసీ విద్యార్దుల బాగోగులు చూసుకునేందుకు ఆదివాసీ ఉద్యోగులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు. అంతర్జాతీయ న్యాయవాదుల దినోత్సవంను గిరిజన విద్యార్దుల నడుమ చేసుకోవడం అబినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పపరిటాల సంతోష్, జి లక్ష్మణ్ కుమార్, ఇర్ప ప్రకాష్, జి ఎస్ పి వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్, పాలెం నాగరాజు, వనవాసీ ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్‌బాబు, వనవాసీ నిలయ ఉపాద్యాయులు జవ్వాది మురళీకృష్ణ, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి పాల్గొన్నారు.