15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లతో ఆత్మీయ సమ్మేళనం

05-01-2026 12:00 AM

పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

బిచ్కుంద, జనవరి 4 (విజయక్రాంతి): బిచ్కుంద మండల కేంద్రంలోని బండాయప్ప ఫంక్షన్ హాల్లో ఆదివారం జుక్కల్ నియోజకవర్గంలోని నూతన సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు మరియు వార్డు సభ్యులతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  మాట్లాడుతూ..నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు మరియు వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.సర్పంచ్ లు అందరూ తమ విధులు పట్ల అవగాహన కలిగి ఉండాలని, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు మరియు వార్డు సభ్యులు పరస్పర సహకారంతో గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు.

సర్పంచ్ ల విధి నిర్వహణలో వారికి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలని, అదేవిధంగా మహిళా సర్పంచ్ ల స్థానంలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోకుండా, మహిళా సర్పంచ్ లు ముందుండి వారి యొక్క విధులు నిర్వహించాలని చెప్పారు. ఇదే ఉత్సాహంతో రాబోయే మున్సిపల్ మరియు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇంతకంటే మంచి ఫలితాలను సాధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా అందించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ , అన్ని మండలాల అధ్యక్షులు, ఏఎంసి  చైర్మన్ లు,పార్టీ సీనియర్ నాయకులు, నూతన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్స్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.