calender_icon.png 12 June, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎన్టీయూసీతోనే సింగరేణి కార్మికుల జీవితాలలో వెలుగులు

10-06-2025 10:44:29 PM

ఐఎన్టియుసి కేంద్ర కమిటీ నాయకులు..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు రెగ్యులర్ రిటైర్డ్ కార్మికుల జీవితాలలో వెలుగులు నిండాలంటే పోరాట చరిత్ర గల ఐఎన్టీయూసీ(INTUC)తోనే సాధ్యపడుతుందని ఐఎన్టియుసి సీనియర్ నాయకులు కాంపల్లి సమ్మయ్య, దేవీ భూమయ్య, రామ్ శెట్టి నరేందర్ లు స్పష్టం చేశారు. పట్టణ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

సింగరేణిలో సంస్థకు లాభాలు గడింపజేసిన రిటైర్డ్ కార్మికులకు కనీస మందులు హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంచకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని హాస్పటల్లో మందులు అందుబాటులో ఉంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కార్మికుల ఆరోగ్యాలను కాపాడాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు జనక్ ప్రసాద్ సీఎంఎండికి విన్నవించడం జరిగిందని గుర్తు చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు అధికారులకు యాజమాన్యానికి మధ్యన సరైన సత్సంబంధాలు లేవని, విధులు నిర్వహించడంలో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యాజమాన్యం చొరవ తీసుకొని అధికారులకు కార్మికుల మధ్య సమన్వయం సాధించేందుకు చర్యలు తీసుకోవాలని  కోరారు. 

కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలన్నారు.. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ జనరల్ సెక్రెటరీ మిట్ట సూర్యనారాయణ, సెక్రటరీ పానుగంటి వెంకటస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శంకర్రావు, జాయింట్ సెక్రెటరీ జగన్నాథ చారి, ఏరియా నాయకులు అక్రముద్దీన్ కన్నయ్య బాబు, పిట్టల శివ లు పాల్గొన్నారు.