16-06-2025 02:14:21 AM
కార్వాన్, జూన్ 15: ఎమ్మెల్సీ కవితను బోనాల పండుగకు ఆహ్వానిం చారు. ఈ మేరకు ఆదివారం గోల్కొండ జగదాంబికా అమ్మవారి ఆలయ సలహాదారు బొమ్మల సాయిబాబా చారి ఆధ్వర్యంలో ఆమెను కలిసి మహంకాళి అమ్మవారి జులూస్ కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సంవత్సరం కనీవిని ఎరుగని రీతిలో గోల్కొండ బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమెకు తెలి యజేశారు. వేడుకలకు తప్పకుండా వస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంకాళి అమ్మవారి పూజారి సురేష్ చారి శివ చారి మల్లేష్ చారి, వృత్తిపనివారలో సంఘం వైస్ ప్రెసిడెంట్ బొమ్మల శ్రీకాంత్ చారి తదితరులు పాల్గొన్నారు.