16-06-2025 02:16:18 AM
ముషీరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి) : బీజేపీ భోలక్ పూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా మహాత్మానగర్కు చెందిన పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబోయిన శివకుమార్ నియమితులయ్యా రు. ఆయన నియామకాన్ని డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రాజశేఖర్ ప్రకటించారు. ఆదివారం శివకుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తన పై నమ్మ కం ఉంచి పదవి బాధ్యతలు అప్పగించిన ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్. విశ్వం, బిజ్జి కనకేష్ కు మార్, డివిజన్ అధ్యక్షుడు రాజశేఖర్లకు కృతజ్ఙతలు తెలిపారు. భోలక్పూర్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషిచేస్తానని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరి స్తూ ప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీకి దగ్గరయ్యేలా తన వంతు కృషిచేస్తానన్నారు.