27-06-2025 02:25:20 AM
-సమగ్ర విచారణ చేస్తే అసత్యాలు వెలుగులోకి
-సర్వేనెంబర్ 576లో 16 గుంటల భూమిలో సిండికేట్లు
- పక్కాగా తనిఖీలు చేపడితే నిజమైన లబ్ధిదారులకు మేలు
-పూర్తిస్థాయిలో అవార్డు పరిశీలిస్తాం: ఘాన్సిరాం నాయక్, తహసీల్దార్, మహబూబ్ నగర్ అర్బన్
మహబూబ్ నగర్ జూన్ 26 (విజయ క్రాంతి) : ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్ర మాలకు శ్రీకారం చుడుతుంది. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ కు తలమానికంగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో భూ సేకరణ ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియలో నియమ నిబంధనలకు దూరంగా ఉన్న పలు అంశాలు ఆల స్యంగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారులు అనుకుంటే ఏదైనా సాధ్యమే అనే విధంగా ఇక్కడ జరిగిన ప్రక్రియలను చూస్తే అర్థమవుతుంది.
ఒకరిపై భూమి ఉంటే మరొకరికి అవార్డు చేసి వారికి సంబంధించిన భూమిలో ఎలా డబ్బులు జమ చేయ డం జరుగుతుందో ఇది కేవలం అప్పటి అర్బన్ తాసిల్దార్ కార్యాలయ అధికారుల కే సాధ్య అయిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై సమగ్రంగా విచారణ చేస్తే భూమి కోల్పోయిన వారికి న్యాయం చేసేందుకు సం బంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-ఎలా సాధ్యమైంది...?
భూసేకరణలో అవార్డుకు సంబంధించి పాస్ పుస్తకాలను పూర్తిస్థాయిలో పరిశీలించి ఎంత భూమి బైపాస్ రోడ్ లో పోతుందనే విషయాలను సమగ్రంగా పరిశీలించిన త ర్వాతనే అవార్డు పాస్ చేయవలసి ఉంటుం ది. ఇందులో ఒకరి భూమి అవార్డులో చే యించి ఆ భూమిని కూడా ఆన్లైన్లో తొలగించలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి.
నిజ మైన లబ్ధిదారులు భూమి కోల్పోయినప్పటికీ వారి భూమి పాస్ పుస్తకం నుంచి తొల గింపు జరగలేదని తదితరులు పేర్కొంటున్నారు. కాగా తమకు సంబంధించిన భూమి మాత్రం 576 సర్వేనెంబర్ లో 16 గుంటలు భూమి బైపాస్ రోడ్లో పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు సిండికేట్లుగా మారి ఈ ప్రక్రియ అంత జరిగినట్లు తెలుస్తుంది. నిజమైన పట్టాదారులకు మేలు జరిగేలా సం బంధిత అధికార యంత్రం సమగ్ర విచారణ చేయాలని బాధితులు కోరుతున్నారు.
- రూ 76 లక్షలు ఇతర ఖాతాల్లోకి....
బైపాస్ రోడ్ లోని 576 సర్వే నెంబర్ కు సంబంధించి 16 గుంటల భూమి అవార్డు రూ 76 లక్షలు ఓ పట్టదారుని ఖాతాలో వేసినట్లు నిజమైన పడ్డదారులు పేర్కొంటున్నా రు. అధికారులు విచారణ చేసి తమ న్యా యం చేయాలని కోరుతున్నారు. అమాయకులు ఉంటే అధికార యంత్రం ఎలా పడితే అలా చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిజమైన పట్టుదలకు మేలు చేసేది పోయి నకిలీ పట్టాదారులకు ఖాతాలో డబ్బులు ఎలా జమ చేస్తారని అధికారులపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ఇకనైనా అధికార యంత్రం ఈ సర్వే నెంబర్ కు సంబంధించి పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేసి నిజమైన పట్టాదారులకు మేలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొందరు సిండికేట్లుగా మారి అప్పటి అధికారులతో కలిసి భూసేకరణ విషయంలో అక్రమాలు పాల్పడినట్లు పలువురు విమర్శిస్తున్నారు. జిల్లా ఉన్నత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేస్తే పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
పట్టాదారులకు న్యాయం చేస్తాం...
పట్టాదారులకు పూర్తి స్థాయి లో న్యాయం చే సేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. భూసేకరణ విషయంలో నేను ఇక్కడ పనిచేయలేదు. 576 సర్వే నెంబర్ కు సంబంధించి 16 గుంటల భూమి విషయంలో పూర్తిస్థాయిలో విచారణ చేయడం జరుగుతుం ది. నిజమైన పట్టాదారులకు న్యాయం జరిగేలా చూస్తాం. ఉన్నతాధికార దృష్టికి తీసుకుపోతాం.
ఘాన్సిరాం నాయక్, తాహసిల్దార్ మహబూబ్ నగర్ అర్బన్మండలం