30-05-2025 01:03:37 AM
- చినుకు పడితే చిత్తడే..
- అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితి
- మూసుకుపోతున్న కంపచెట్లు
- బీటీ రోడ్లుగా మార్చాలంటూ వినతుల వెల్లువ
చండూరు, మే 28: చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామం నుండి బంగారిగడ్డకు పోయే మట్టి రోడ్డు వర్షం వస్తే గుంతల మయంగా మారడంతో పాటు ఈ రోడ్డు వెంట కంప చెట్లు మూసుకో పోవడంతో రైతులకు, వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ రోడ్డు బంగారుగడ్డకు పోయే ప్రధాన రహదారిగా ఉంది. ఈ రోడ్డు వెంట కంపచెట్లు గతంలో ఉపాధి హామీ పథకంలో పెట్టి ఈ కంప చెట్లను తొలగించారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోడ్డు గుంతల మయంగా మారడంతో పాటు, కంప చెట్లతో మూసు కోపోయింది. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కూడా ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి లింకు రోడ్లు వేస్తామని ఇంతవరకు వేయలేదు.
ఈ విషయంపై గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాం లో ఈ రోడ్డును బాగు చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చి హామీని అమలు చేయలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు వెంట ప్రతినిత్యం వాహనదారులు, ప్రజలు నడవాలంటే ఏం జరుగుతుందని భయభ్రాంతులకు గురవుతున్నారు.
చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో కొన్ని వార్డులలో రోడ్లు గుంతల మయంగా మారాయని మున్సిపాలిటీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ కేంద్రంలో వర్షం వస్తే కొన్ని వార్డులలో రోడ్లు నీటిని తలపిస్తున్నాయి. మండల పరిధిలోని లింకు రోడ్లు నేర్మట నుండి బంగారిగడ్డ, పుల్లెంల, శేరి గూడెం, లెంకలపల్లి, గొల్లగూడెంఅదేవిధంగా ధోని పాముల ప్రధాన రహదారి నుండినుండి జోగిగూడెం, తిమ్మారెడ్డి గూడెం తిమ్మారెడ్డి గూడెం నుండినరసింహుల గూడెం రోడ్డు, తుమ్మలపల్లి నుండి గుండ్రపల్లి, చామల పల్లి, బోడంగిర్తి నుండి పుల్లెంల, పుల్లెంల నుండి తాస్కా ని గూడెం, తాస్కాని గూడెం నుండిశిర్ధపల్లి, పుల్లెంల ఈ రోడ్డు మార్గాలకు లింకు రోడ్లు వేస్తామని చెప్పి ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్కడ కూడా పూర్తి చేయలేదు.
కొన్ని రోడ్లకుపనులు ప్రారంభించి, ఇంకా చాలా లింకురోడ్లకు పనులు ప్రారంభించలేదు. కొన్ని లింకు రోడ్లకు పనులు ప్రారంభించి మధ్యలో పనులు బంద్ చేశారు. కొన్ని రోడ్లకు శంకుస్థాపనచేసి ఆ రోడ్లు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. తిమ్మారెడ్డి నుండి నరసింహుల గూడెం ప్రధాన రహదారికి రోడ్డు పనులు ప్రారంభించి సుమారు మూడు నెలలు కావస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఈ రోడ్డు పనులు నత్త నడకగా సాగుతున్నాయి.
గత నెల క్రితం ఈ లింకు రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు ఈ రోడ్డు పనులు మధ్యలోనే పనులు బంద్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వివిధ గ్రామాల లింక్ రోడ్లను పూర్తిచేయాలని, నేర్మట నుండి బంగారిగడ్డకు పోయే మట్టి రోడ్డునును బీటీ రోడ్డుగా మార్చాలని, మూసుకో పోయిన కంప చెట్లు తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మట్టిరోడును బీటి రోడ్డుగా మార్చాలి
-నేర్మట నుండి బంగారిగడ్డకు పోయే మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని, ఈ రోడ్డు దారి వెంట వర్షం వస్తే గుంతల మయంగా మారుతుందని, అదేవిధంగా ఈ రోడ్డు వెంట కంప చెట్లు మూసుకొని పోవడంతో ఈ దారి వెంట నడవాలంటే రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చుట్టుపక్కల గ్రామాలైన పుల్లెంల, లెంకలపల్లి, శేరి గూడెం, గొల్లగూడెం ఈ గ్రామాలకు లింకు రోడ్డు లేకపోవడంతో రైతులు మందు బస్తాలు ట్రాక్టర్ల ద్వారా తీసుకపోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ లింక్ రోడ్లను ప్రభుత్వం త్వరితగతిన పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
ఈరటి వెంకటయ్య, స్థానికులు
ఎన్నికల హామీలను అమలు చేయాలి
రాష్ర్ట ప్రభుత్వం ఎన్నికల ముందు లింకు రోడ్లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, హామీలను నిలబెట్టుకోవాలి. చండూరు మున్సిపల్ కేంద్రంలో కొన్ని వార్డులలో వర్షం వస్తే రోడ్ల వెంట గుంతల మయంగా నీటిని తలపిస్తున్నాయి.
కొన్ని గ్రామాలలో లింక్ రోడ్లు ప్రారంభించి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మధ్యలోనే పనులు బందు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్ల మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
- చిట్టిమళ్ల లింగయ్య, సీపీఎం నేత