26-01-2026 08:42:04 PM
అనంతపురం: కీలక ప్రాంతీయ మార్కెట్లలో కస్టమర్ల సౌకర్యం కోసం ఇసుజు మోటార్స్ తన సేవలను విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఇసుజు మోటార్స్ ఇండియా అనంతపురములో తన కొత్త అధీకృత సర్వీస్ సెంటర్ (ఏఎస్సి) టోలీ మోటార్స్ ను అనంతపురంలో ప్రారంభించింది. ఈ సర్వీస్ సెంటర్ ను ఇసుజు మోటార్స్ ఇండియా సీనియర్ అధికారులు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో నెట్ వర్క్ టచ్పాయింట్ ప్రారంభించడం ద్వారా తన అమ్మకాల-అనంతర మౌలికసదుపాయాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యమంటున్నారు.
రాష్ట్రంలోని వినియోగదారులకు అందుబాటులో సేవా సహకారాన్ని అందించాలనే కంపెనీ యొక్క ప్రయత్నాల్లో భాగంగానే దీనిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అనంతపురములోని కొత్త సర్వీస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో ఐఎంఐ యొక్క 8వ కస్టమర్ టచ్పాయింట్ అనీ, ఇది రాష్ట్రంలోని కంపెనీ సర్వీస్ నెట్ వర్క్ ను మరింత శక్తివంతం చేసుందనీ ఇసుజు మోటార్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ టోరు కిషిమోటో అన్నారు.
ఈ ప్రాంతంలో వినియోగదారులకు విశ్వసనీయమైన, అధిక-నాణ్యత కలిగిన సేవలను అందించాలన్న నిబద్ధతే తమ లక్ష్యమని తెలిపారు. ఇసుజు మోటార్స్ ఇండియా వారి భాగస్వాముతో అనంతపురములో కొత్త అధీకృత సర్వీస్ సెంటర్ ప్రారంభినందుకు సంతోషంగా ఉందని, ఆధునిక సదుపాయాలు ,సుశిక్షితులైన సిబ్బందితో అధిక-నాణ్యత కలిగిన సేవలను అందిస్తామని టోలీ మోటార్స్ డీలర్ ప్రిన్సిపల్ ఆదినారాయణ చెప్పారు.