ఏఈఈ పోస్టింగ్లు ఇవ్వకపోవడం బాధాకరం
నియామక పత్రాలు వెంటనే అందజేయాలి
ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా, ప్రభుత్వం ఇంతవరకూ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. మంగళవారం గాంధీభవన్ వద్ద మోకాళ్లపై నిరసన తెలుపుతున్న ఏఈఈ అభ్యర్థులకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆయన సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేసిందని గుర్తు చేశారు. అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి నా ఇంకా నియామక పత్రాలు విచారకరమని మండిపడ్డారు. వెంటనే ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.






