06-06-2025 01:36:23 AM
అందుకోసం ప్రతిఒక్కరూ నడుం బిగించాలి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): పర్యావరణాన్ని కాపాడేం దుకు ప్రతిఒక్కరూ నడుంబిగించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని తన అధికారిక నివా సంలో మొక్కలు నాటారు.
ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని, ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన పలువు రు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి వారికి శాలువా కప్పి అభినందించారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి వారికి వివరించారు.
అనంతరం విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలను అడి గి తెలుసుకొని, వాటిని సాధించేవరకు పట్టు విడవకుండా నిరంతరం కృషి చేయాలని తెలియజేశారు. పర్యావరాణాన్ని కాపాడుతూ.. క్షేత్రస్థాయిలో ఎంతో మంది పుడమి తల్లికి సేవ చేస్తున్నారని, వారందరి నుంచి మనమంతా స్ఫూర్తి పొందాల్సిన అవసరముందన్నారు.
కర్బన ఉద్గారాలు మొదలు, ప్లాస్టిక్ వాడ కం సహా అనేక కాలుష్య కారకాలను తగ్గించుకుంటూనే, చెట్ల పెంపకానికి ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని, పర్యావరవరణ పరిరక్షణను తమ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.