ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): రేవంత్రెడ్డి సర్కార్ను ముట్టు కోవడం బీఆర్ఎస్ తరం కాదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల కార్యకర్తల సమావేశంలో విప్ మాట్లాడారు. గత పదేండ్లలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. హరీశ్రావు రుణమాఫీపై చేసిన సవాలుపై రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీలోంచి తెలంగాణ అనే పదాన్ని తొలగించినప్పుడే ప్రజలు గమనించారని, తెలంగాణ ప్రజలను రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం పాటుపడాలని కార్యకర్తలకు పిలుపిచ్చారు.