calender_icon.png 19 June, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం..

19-06-2025 07:31:11 PM

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం ఒక్కటై ముందుకెళ్దాం..

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం..

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.. 

మునుగోడు (విజయక్రాంతి): రాజకీయాన్ని వ్యభిచారంగా చిత్రీకరించకుండా విలువలతో కూడిన రాజకీయం చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. గురువారం మునుగోడు క్యాంపు కార్యాలయంలో నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసి మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం ఏకమై మునుగోడు నియోజకవర్గంలో అన్ని స్థానాలు క్లీన్ స్వీప్ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో మన కళ్ళ ముందు రెండే రెండు లక్ష్యాలు కనిపిస్తున్నాయని  ఒకటి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో సత్తా చాటడం, మరొకటి నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం అందరం ఏకతాటిపై కొచ్చి  అభివృద్ధి చేసుకోవడమన్నారు. దేశం మొత్తం మునుగోడు వైపు చూసే విధంగా  మునుగోడు నియోజకవర్గాన్ని రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోవాలన్నారు... ప్రతి గ్రామంలో నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో నాంపల్లి మండలంలో ని ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.