30-06-2025 02:55:01 AM
జహీరాబాద్, జూన్ 29 : జహీరాబాద్ పట్టణంలో జగన్నాథ రథయాత్రను ఘనం గా నిర్వహించారు. శనివారం రాత్రి హరే రామ హరే కృష్ణ మూమెంట్ వారి ఆధ్వర్యంలో రథయాత్రను ప్రారంభించారు. రథ యాత్ర మాణిక్ ప్రభు మందిర్ నుండి ప్రా రంభమై హనుమాన్ మందిర్ రోడ్డు ద్వారా పురవీధుల గుండా తీసుకెళ్తూ భవాని మం దిర్ వద్ద ముగింపు నిర్వహించారు. ఈ రథయాత్రలో పట్టణంలోని వివిధ వర్గాలకు చెం దిన ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. రథయాత్రను ముందు యువకులు ఉత్సాహం గా నృత్యాలు చేశారు. హరే రామ.. హరే కృ ష్ణ కృష్ణ అంటూ జగన్నాథ యాత్రను ముం దుకు సాగించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన వ్యాపారవేత్తలు భక్తులు పాల్గొన్నారు.