12 July, 2026 | 2:12 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

మా సీఎంని మీరు తిడితే.. మేమూ ప్రధానిని అంటాం: జగ్గారెడ్డి

06-05-2025 07:34 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. విమర్శలకు హద్దులు ఉండాలి రఘునందన్ రావు అంటూ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీరు తిడితే, అందుకు ప్రతికారంగా తాము ప్రధానమంత్రి నరేంద్రమోదీని అంటామని, గత పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ  బీజేపీ పార్టీ సంసారం చేసి ఇప్పుడు మాట్లాడుతున్నారా అని జగ్గారెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీ దేశ ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్నారు.. వేశారా.. ?, మోసగాళ్లకు మోసగాడు మోడీ అంటే.. మీరు ఫీల్ అవ్వరా..? అని జగ్గారెడ్డి, ఎంపీ రఘునందన్ రావును ప్రశ్నించారు.