17 April, 2026 | 2:31 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి

06-05-2025 09:30 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో జరిగింది. ఎస్ఐ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పెద్దంపేట గ్రామ పంచాయతీ  చెత్త సేకరణ ట్రాక్టర్ చెత్త సేకరణ సమయంలో అతివేగంగా అజాగ్రత్త గా వచ్చిన ట్రాక్టర్ ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుని పైనుండి పోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి  తరలించగా  వైద్యులు పరీక్షించి బాలుడు మృతి చెందినట్లు ధృవీకరించారు. బాలుని యొక్క తండ్రి జనగామ శ్రావణ్ ఫిర్యాదు మేరకు బాలుని మృతికి కారణమైన గ్రామపంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్ డ్రైవర్ కురుసం రామకృష్ణ ఫై కేసు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.