calender_icon.png 7 May, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా ఓజీ కుష్ గంజాయి పట్టివేత

06-05-2025 07:55:47 PM

రాజేంద్రనగర్,(విజయక్రాంతి): శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా ఓజీ కుష్ గంజాయిని మంగళవారం పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఓజీ కుష్ అనే గంజాయిని 24 బ్యాగుల్లో తరలిస్తుండగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  ఓజీ కుష్ గంజాయి విలువ కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

కాగా.. 2024-25లో పలు కేసుల్లో 2010.135 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దానంతటిని కాల్చివేసినట్లు డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్ పర్సన్, రైల్వే ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. మొత్తం 74 కేసుల్లో రూ.10,05,06,750 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు.