05-05-2025 01:07:58 AM
భద్రాద్రి కొత్తగూడెం మే 4 (విజయ క్రాంతి)- ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోనిజలగం పార్క్ వద్ద ఆదివారం మాజీ ముఖ్య మంత్రివర్యులు జలగం వెంగళ్రావు జయంతి వే డుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ మహనీయుడి విగ్రహానికి సత్తుప ల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పూ లమాల వేసిన వాళ్లకి అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాతగా వెంగళరావు జిల్లా ప్రజ ల గుండెల్లో పదిలంగా నిల్చారన్నారు. ఖ మ్మం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమం లో సత్తుపల్లి పట్టణ మాజీ కౌన్సిలర్స్ సత్తుపల్లి పట్టణ, మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, జలగం అభిమానులు పాల్గొన్నారు.