6 August, 2026 | 8:37 PM

Breaking News

ఏఐకేఎంఎస్ రాష్ట్ర 9వ మహాసభలను జయప్రదం చేయాలి: మామిడాల భిక్షపతి   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ధర్మరావుపేట విద్యార్థి ఎంపిక   •   వారాంతపు సంతను ప్రారంభించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు   •   300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత   •   ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని నిర్వహించిన బోధన్ స్వర్ణకార సంఘం   •   నిజాయితీ, నిరాడంబర జీవనానికి ఆదర్శం ప్రొఫెసర్ జయశంకర్   •   నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి   •   అనుమతి లేకుండా కమ్యూనిటీ హాల్ కూల్చివేత   •   జగ్గయ్యపల్లి ఉపాధి హామీ(వీబీజీ రాంజీ) ఆర్ధిక, అక్రమాలపై ఫిర్యాదులు   •   కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలి   •  

బెటాలియన్‌లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

06-08-2026 07:28 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని గంగారంలో గల 15వ పోలీసు బెటాలియన్,  తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త కీర్తిశేషులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ బి. వేణుగోపాల్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై, ప్రొఫెసర్ జయశంకర్  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ మాట్లాడుతూ... ప్రొఫెసర్ జయశంకర్ గొప్ప విద్యావేత్త, తెలంగాణ సిద్ధాంతకర్తగా చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.

తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడిగా ఆయన సేవలను స్మరించారు. నాన్-ముల్కీ ఉద్యమం, సాంబార్–ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమం వంటి తెలంగాణ హక్కుల ఉద్యమాలలో ఆయన చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తన కళ్లారా చూడాలని ఎన్నోసార్లు ఆకాంక్షించిన జయశంకర్  2011 జూన్ 21న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందే మరణించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను సాకారం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.