6 August, 2026 | 9:50 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలకు పారమిత విద్యార్థులు   •   నియోజకవర్గ కేంద్రం నుండి ఏ భవనం తరలిపోదు: మాజీ ఎంపీ   •   మూడున్నర కిలోల కణితి   •   మోడల్ స్కూల్‌లో స్టూడెంట్ లీడర్ కోసం ఎన్నికలు   •   తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ కు బీజేపీ నాయకుల నివాళులు   •   ఉపసర్పంచ్‌ల హక్కుల సాధనకు జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమించాలి   •   సిమెంట్ రోడ్లకు గ్రీన్ సిగ్నల్.. నెల రోజుల్లో నిధుల మంజూరు   •   బాధను అనుభవిస్తేనే భావోద్వేగ ప్రేమకథలు రాయగలం   •   గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయాలి: కల్లుగీత కార్మిక సంఘం   •   ప్రో. జయశంకర్ సార్ కు బిజెపి నాయకుల నివాళులు   •  

వారాంతపు సంతను ప్రారంభించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

06-08-2026 08:19 PM

రామగిరి,(విజయ క్రాంతి): రామగిరి మండలం చందనాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రతి వారానికి ఒకసారి నిర్వహించే వారాంతపు సంత (వీక్లీ సంత)ను గ్రామ సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ తో కలిసి మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ వారాంతపు సంతలో కూరగాయలు, పండ్లు, కిరాణా వస్తువులు, గృహోపకరణాలు, వ్యవసాయానికి అవసరమైన వస్తువులు, ఇతర నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి వారం జరిగే సంతకు విచ్చేసి, తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసి స్థానిక వ్యాపారులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమం లో కమన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్ ఎస్ అన్వర్ ,చందనాపూర్  వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు, మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, మాజీ సర్పంచ్ ఎరుకల ఓదెలు, రామగిరి మండల ల్యాబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చక్రి తదితరులు పాల్గొన్నారు.