6 August, 2026 | 8:37 PM

Breaking News

ఏఐకేఎంఎస్ రాష్ట్ర 9వ మహాసభలను జయప్రదం చేయాలి: మామిడాల భిక్షపతి   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ధర్మరావుపేట విద్యార్థి ఎంపిక   •   వారాంతపు సంతను ప్రారంభించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు   •   300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత   •   ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని నిర్వహించిన బోధన్ స్వర్ణకార సంఘం   •   నిజాయితీ, నిరాడంబర జీవనానికి ఆదర్శం ప్రొఫెసర్ జయశంకర్   •   నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి   •   అనుమతి లేకుండా కమ్యూనిటీ హాల్ కూల్చివేత   •   జగ్గయ్యపల్లి ఉపాధి హామీ(వీబీజీ రాంజీ) ఆర్ధిక, అక్రమాలపై ఫిర్యాదులు   •   కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలి   •  

తల్లిపాలతో వ్యాధి నిరోధక శక్తి

06-08-2026 07:25 PM

ఐసిడిఎస్ సూపర్వైజర్ రజని

సత్తుపల్లి,(విజయక్రాంతి): తల్లిపాలలో పోషక విలువలు మెండుగా ఉంటాయని, తల్లిపాలు తాగిన పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని,వ్యాధులు దరి చేరవని ఐసిడిఎస్ సూపర్వైజర్ రజిని అన్నారు. గురువారం  మండల పరిధిలోని యాతాలకుంట గ్రామంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలు ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై, అనంతరం మాట్లాడుతూ తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు, చురుకుదనం అధికంగా ఉంటాయని అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లి బిడ్డ అనుబంధాన్ని, తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా అంగన్వాడి టీచర్లు గీసిన చిత్రం గురించి తెలియజేస్తూ సమావేశానికి వచ్చిన గర్భిణీలు, బాలింతలు,తల్లులు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు.