calender_icon.png 19 November, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

19-11-2025 02:21:15 PM

మందమర్రి,(విజయక్రాంతి): ప్రముఖ స్వాతంత్ర సమర యోధురాలు ఝాన్సీ లక్ష్మీ బాయి జయంతి వేడుకలను పట్టణంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్, సింగరేణి ఎస్ అండ్ పిసి ఉద్యోగి రాజేష్ పివ్హల్ రాణి పివ్హాల్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. అనంతరం కేకును కట్ చేసి విద్యార్థులకి స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానో పాధ్యాయులు జె.పురుషోత్తం మాట్లాడుతూ... ఝాన్సీ లక్ష్మీబాయి  వారణాసిలో జన్మించిన ఆమె భారత స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన నాయకురాలని, చిన్నతనం నుంచి గుర్రపు స్వారీ కత్తి యుద్ధం నేర్చుకుని 1857 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన భారత తిరుగుబాటులో ఆమె కీలక పాత్ర పోషించి ధైర్యానికి దేశభక్తికి ప్రతికగా నిలిచారని ఆమె సేవలను కొనియాడారు. ఝాన్సీరాణి చిన్నతనం నుండి దేశ స్వాతంత్రం కోసం పోరాడి 1858 జూన్ లో వీర మరణం పొందారని అన్నారు.

భారత దేశ చరిత్రలో ఒక వీరవనితగా స్వాతంత్ర సమరయోధురాలిగా గౌరవించబడిందని ఆమె ధైర్యం దృడ సంకల్పం నేటికీ అనేక మందికి ప్రేరణ నిస్తాయని, విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి దేశభక్తిని పెంపొందించు కోవడంతో పాటు స్వాతంత్ర సమర యోధులను స్మరించు కోవలసిన అవసరం ఉందన్నారు. అనంతరం రాజేష్ రాజేష్ ఫీహ్వాల్  మాట్లాడుతూ విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుండే దేశభక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యం తో స్వతంత్ర సమరయోధులు, మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగు తుందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎం జీవన్, దేవమ్మ, అనుపమ, రూపాలత, ఆశాజ్యోతి, రవీందర్, విద్యార్థులు  పాల్గొన్నారు.