19-01-2026 12:46:00 AM
టీఎస్యూటీఎఫ్ డిమాండ్
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): రెండు దశాబ్దాలుగా నామమాత్రపు వేతనాలతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్ధాంతరంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎస్ యూటీఎఫ్ఎఫ్ అధ్యక్ష, కార్య దర్శులు చావ రవి, ఎ.వెంకట్ కోరారు.
ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వద్ద జరిగిన కారు ప్రమాదంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని గీతారెడ్డి తోపాటు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కల్పన మరణించారని, అయితే ఆ కుటుంబాలకు అందే మరణానంతర ప్రయోజనా ల్లో మాత్రం తీవ్రమైన వ్యత్యాసం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేజీబీవీల్లో కాంట్రాక్టు పద్ధతిన ఎంతకాలం పనిచేసినా ఆ ఉద్యోగులకు నెలవారీ ఇచ్చే వేతనం మినహా ఏరక మైన ప్రయోజనాలు అందడంలేదన్నారు.
అనారోగ్యానికి గురైనా, ప్రమాదంలో అర్ధాంతరంగా మరణించినా ఎటువంటి పరిహా రాన్ని సర్కారు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన కల్పన కుటుం బం కడు పేదరికంలో ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుం బాన్ని ఆదుకోవాలని, పిల్లల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణం లో ఆలోచించి సర్వీసులో ఉండగా మరణించిన కేజీబీవీ ఉద్యోగి కుటుంబానికి కనీసం రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో అర్హులైన ఒకరికి కారు ణ్య నియామకం కల్పించాలని డిమాండ్ చేశారు.