calender_icon.png 28 November, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లో చేరికలు

28-11-2025 10:29:02 PM

కొల్చారం: కొల్చారం మండలం పైతర మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీల మార్పు జోరుగా సాగుతుంది. నర్సాపూర్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పావులు కలుపుతున్నారు. ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి పార్టీలో చేరారు. చంద్రశేఖర్ రెడ్డికి కండువా కప్పిన ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.