12 June, 2026 | 1:15 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •  

వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం

28-01-2025 01:36 AM

న్యూఢిల్లీ, జనవరి 27: వక్ఫ్ సవరణ బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పలు ప్రతిపాదనలతో ఆమోదం తెలిపింది. ఈనెల 31న తుది నివేదిక లోక్‌సభకు అందజేయనున్నట్లు సంబంధిత వర్గాల స మాచారం. రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించే అవకాశా లు కనపడుతున్నాయి.

మొత్తంగా 44 సవరణలు సూచించగా..14 సవరణలను మాత్ర మే కమిటీ ఆమోదించినట్లు జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ వెల్లడించారు. ఎన్డీయే సభ్యులు సూచించిన మార్పులకు మాత్రమే ఆమోదం లభించిందని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. 31న తుది నివేదికను లోక్‌సభకు అందజేయనున్నారు.