17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

భారీ వర్షాలతో భద్రాచలం మీదుగా వెళ్లే రహదారులు బంద్

29-10-2025 05:09 PM

భద్రాచలం నుండి మారేడుమిల్లి మీదుగా రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లే రహదారులు బంద్ 

భద్రాచలం (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని భద్రాచలం నుండి ఘాట్ రోడ్లో వయా మారేడుమిల్లి మీదుగా రాజమండ్రి వెళ్లే రహదారిని బుధవారం మూసివేశారు. అదేవిధంగా భద్రాచలం నుండి వైజాగ్ వెళ్లే రహదారి సైతం భారీ వర్షాల వలన సౌకర్యానికి ఆటంకం ఏర్పడింది. మొంథా తుఫాన్ కారణంగా మంగళవారం నుండి ఎడతెరిపి లేకుండా మారేడుమిల్లి గుట్టలలో, సీలేరు గుట్టలలో భారీ వర్షాలు పడటం వలన రోడ్డుపై ఆ నీరంతా  ఘాట్ రోడ్లపై భారీగా ప్రవహించడం, పలుచోట్ల రోడ్డుపై చెట్లు, పెద్ద పెద్ద రాళ్లు అడ్డంగా పడటంతో రవాణా సౌకర్యానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో అనేక మంది ప్రయాణికులు భద్రాచలం నుండి ఆంధ్రప్రదేశ్ లోని చింతూరు కేంద్రానికి చేరుకొని తిరిగి వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.