15 June, 2026 | 6:15 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: 9 గంటల వరకు 10.2 శాతం ఓటింగ్

11-11-2025 10:33 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో(Jubilee Hills bypoll) మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 10.2 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఉప ఎన్నికలో తొలి ఓటర్లలో ప్రఖ్యాత సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉన్నారు. రాజమౌళి షేక్‌పేటలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేయగా, మాగంటి సునీత తన కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లారెడ్డిగూడ నవోదయనగర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నాగార్జుననగర్ లో ఓటు వేశారు. పోలింగ్ ప్రారంభమైన 2 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగింది. జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ 103, 341 నుండి 345 పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక పోలింగ్ కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతోంది. 4.01 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు వేయనున్నారు. ఈ ఉపఎన్నికలో 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలలో 226 పోలింగ్ కేంద్రాలను క్లిష్టమైనవిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ కోసం కేంద్ర భద్రతా దళ సిబ్బందితో పాటు దాదాపు 1,800 మంది పోలీసులను మోహరించారు. మొదటిసారిగా, అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని విశ్లేచేందుకు డ్రోన్ నిఘాను మోహరించారు. ఈ ఏడాది జూన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ ఎల్ దీపక్ రెడ్డిని నిలబెట్టగా, గోపీనాథ్ భార్య సునీత బిఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని AIMIM మద్దతుతో బరిలోకి దిగారు.