calender_icon.png 1 August, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు న్యాయం

15-05-2025 12:00:00 AM

ఎక్వాయిపల్లిలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, గువ్వల బాల్ రాజ్ 

కడ్తాల్, మే 14 : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు న్యాయం జరిగుందని మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, గువ్వల బాల్ రాజ్ అన్నారు. బుధవారం కడ్తాల్ మండలం (ఏ) ఎక్వాయిపల్లి గ్రామంలో రైతుల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న కేంద్రాన్ని వారు పరిశీలించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడారు ఎక్వాయిపల్లి  గ్రామంలో 5 వేల ఎకరాల పంట నష్టం జరిగిందని వెంటనే ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు రూ. 30 వేల ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా,  రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు జోగు వీరయ్య, జర్పుల దశరథ్ నాయక్, నరసింహ భరతమ్మ తదితరులు పాల్గొన్నారు.