26-05-2025 09:16:18 PM
హైదరాబాద్: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని పోడిగిస్తూ హర్యానాలోని హిసార్ కోర్టు విధించింది. పాకిస్తాన్ తరపున గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతిని అరెస్టు పోలీసులు చేశారు. మొదట్లో ఐదు రోజుల పోలీసు కస్టడీలో ఉన్న జ్యోతి మల్హోత్రాకు గడువు ముగియడంతో దర్యాప్తు అధికారులు గడువు పొడిగించాలని అభ్యర్థించారు. వారి అభ్యర్థన మేరకు కోర్టు అదనంగా నాలుగు రోజుల పోలీసు కస్టడీని మంజూరు చేసింది. గత గురువారం పొడిగించిన రిమాండ్ ముగిసిన తర్వాత అధికారులు సోమవారం జ్యోతి మల్హోత్రాను కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు విన్నహిసార్ కోర్టు న్యాయమూర్తి ఆమెను మళ్లీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు పది మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.