calender_icon.png 8 June, 2025 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాయిని అడుగులు.. అభివృద్దికి పరుగులు

26-05-2025 08:04:17 PM

పదేండ్ల సమస్యకు.. పది నిమిషాల్లో పరిష్కారం

యుద్ద ప్రాతిపదికన పనులు జరగాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు: ఎమ్మెల్యే నాయిని

కాజిపేట్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాజీపేటలోని 47వ డివిజన్ లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పర్యటించారు. 47వ డివిజన్ కడిపికొండ ఫ్లయ్ఓవర్ బ్రిడ్జ్ సమీపంలోని ఈఎల్ఎస్ (Electric Loco Shed) రైల్వే ట్రాక్ కింది ఉన్న కల్వర్టును శుభ్రపరిచె కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాయిని సోమవారం ప్రారంభించారు. కల్వర్టులో కూరుకుపొయిన చెత్త వల్ల వర్షాకాలంలొ నీరు నిలిచి బుడిద గడ్డ, బాబుజి నగర్, డిజిల్ కాలని, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలు మునిగిపోతాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే వారి ఇడ్లల్లోకి నీరుచేరి ప్రజలు ఇబ్బందులకు పడుతున్నారు. కొద్దివానకె కాజీపేట రైల్వే స్టేషన్ మూనిగిపోతుంది. దాని ద్వారా నీరు బయటికి వచ్చి రోడ్లన్ని జలమయమై చిరు వ్యాపారస్తులు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతారు.

రానున్న వానకాలం దృష్ట్యా మళ్లి ఇలాంటి సమస్య తలెత్తకూడదని ఎమ్మెల్యే నాయిని చోరవ తీసుకొని రైల్వే అధికారులతో కలిసి ఈఎల్ఎస్ వద్ద ఉన్న కల్వర్టుని పరిశీలించి తక్షణమే తగు చర్యలు చేపట్టాలని సంబదిత జీడబ్ల్యూఎంసీ, ఎంహెచ్ఓ, మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం జీడబ్ల్యూఎంసీ రెండు జేసీబీలను తెప్పించి పనులను ప్రారంభించింది. కల్వర్టు శుద్దికరణ, నిర్మాణ పనులు యుద్ద ప్రాతిపదికన జరగాలని, రానున్న వర్షాలకు చుక్క నీరు నిల్వకుండ చెయ్యలని సూచించారు. ఎలాంటి అవసరం ఉన్న తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అధికారులకు తెలిపారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పదేండ్ల సమస్యను తన దృష్టికి తీసుకురాగానే పది నిమిషాల్లో పరిష్కారం చూపినందుకు స్థానిక ప్రజలు  ఆనందంతో ఎమ్మెల్యే నాయినికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే, మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు ఎంహెచ్ఓ, జీడబ్ల్యూఎంసీ సిబ్బందితో పాటు స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.