కడియం కావ్య విజయానికి కృషి చేయాలి

02-05-2024 01:02:51 AM

శ్రేణులకు మంత్రి కొండా సురేఖ పిలుపు

వరంగల్, మే 1 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా వరంగల్ కాంగ్రె స్ అభ్యర్థి కడియం కావ్య విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. వరంగల్ ఓ సిటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో బుధవారం తూర్పు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, బీజేపీ పాలనలో రాష్ట్రానికి, దేశానికి మేలు జరుగలేదని ఆరోపించారు. ఆ పార్టీల వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజా సంక్షేమం కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు సూచిం చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి కడి యం కావ్య, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరగా వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.