టీడీపీ నేతలకు మంత్రి పొంగులేటి విజ్ఞప్తి
ఖమ్మం, మే 1(విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం నాయకు లు కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతిచ్చి సహకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. నేరుగా తమతో కలిసి పనిచేయొచ్చని సూచించారు. రఘురాంరెడ్డి తో పాటు మంత్రి పొంగులేటి బుధవారం ఖమ్మంలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లా రు. టీడీపీ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కేతినేని హరీశ్తో చర్చించారు. స్వర్గీయ ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని టీడీపీ చేస్తున్న పోస్టుకార్డు ఉద్యమంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తోడ్పాటు అందించిన విధంగానే, ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లోనూ మద్దతివ్వాలని, రఘురాంరెడ్డి గెలుపుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, చైర్మన్ మువ్వావిజయ్బాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, ముస్తాఫా, కొప్పు ల చంద్రశేఖర్రావు తదితరులున్నారు.