25 March, 2026 | 3:02 AM

కడ్తాల్ హెడ్మాస్టర్ సస్పెన్షన్

25-03-2026 01:42 AM

నిర్మల్, మార్చి 2౪ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ వెంకటేశ్వరలను మంగళవారం సస్పెండ్ చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. సోమవారం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రాళ్లు రావడంతో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో విచారణ జరిపి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహ రించడం వల్లనే ఈ ఘటన జరిగినట్టు తెలిపారు.

ప్రధానోపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వివరించడం వలన ఈ ఘటన చోటుచేసుకుందని ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి ఆమె ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్టు ఆయన వెల్లడించారు. మధ్యాహ్న భోజనం నిర్లక్ష్యంగా వవరిస్తే ఉపాధ్యాయులపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.