calender_icon.png 28 October, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుస్తె మట్టెలు పంపిణీ చేసిన కరీంనగర్ ఆర్యవైశ్య నేతలు

28-10-2025 07:41:20 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): వీణవంక మండలం బొంతుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన అమ్మాయి నవ్య వివాహం నవంబర్ 1వ తేదీన నిశ్చయించడం కావడంతో, ఆ నిరుపేద కుటుంబానికి సహాయంగా వివాహం చేయడానికి కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య నేతలు ముందుకు వచ్చారు. కరీంనగర్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ దాతల సహకారంతో కరీంనగర్ లోని వైశ్య భవన్ లో పెళ్లికూతురుకి చీర, పుస్తె మట్టెలు అందజేశారు.

ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఇకముందు కూడా చేస్తామని తెలిపారు. మమ్మల్ని ప్రోత్సాహస్తూ సహాయం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి పెద్ది వేణుగోపాల్, కోశాధికారి సుద్దాల వెంకటేష్, బొడ్ల శ్రీరాములు, తిరుపతి, అలెంకి సంతోష్ రాజ్, సంతోష్, కిరణ్ కుమార్ తో పాటు అమ్మాయి బంధువులు పాల్గొన్నారు.