12-06-2025 05:51:03 PM
హైదరాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS chief Kalvakuntla Chandrashekar Rao) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాసాల మీద విమానం కూలడంతో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రయాణికులు, సామాన్యులు, వైద్య విద్యార్థులు మరణించడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కేసీఆర్ కోరారు. తమ ఆప్తులను కోల్పోయి శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పవిత్రమైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్..
హైదరాబాద్: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం జనావాసాలపై కుప్పకూలిన ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. విమాన ప్రమాదంలో ప్రయాణికులు, స్థానికులు, మెడికోలు మరణించడం అత్యంత దురదృష్టకరం అని తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని భరించే శక్తి బాధిత కుటుంబాలకు లభించాలని ప్రార్థిస్తున్నానన్నారు. చనిపోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వాన్ని కోరుకున్నారు.