28-01-2026 11:49:42 AM
అజిత్ పవార్ మరణం తీరని లోటు: కేసీఆర్
హైదరాబాద్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) సంతాపం ప్రకటించారు. రైతు ఉద్యమ నేతగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించి, మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా ఎదిగి, పలు హోదాల్లో పనిచేసిన అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని కేసీఆర్ అన్నారు.
శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత అజిత్ పవార్(Maharashtra Deputy CM Ajit Pawar) బుధవారం ఉదయం విమాన ప్రమాదంలో మరణించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం, ముంబై నుండి బారామతికి వెళ్తున్న చార్టర్డ్ విమానం ఉదయం 8:45 గంటలకు కూలినప్పుడు, అందులో ఉన్న సిబ్బందితో సహా ఐదుగురు మరణించారు. ముంబై-బారామతి చార్టర్డ్ విమానం కూలిపోవడం బారామతిలోని రన్వే ప్రారంభంలో జరిగింది.