06-07-2025 12:08:37 AM
వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): స్వల్ప అస్వస్థత కారణంగా గత గురువారం యశోద దవాఖానాలో అడ్మిట్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైద్యుల సలహామేరకు శనివారం డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రి నుంచి ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్లోని తన నివాసానికి వెళ్లిపోయారు. రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణ అనంతరం ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నదని, సోడియం లెవల్స్ కొద్దిగా పెరిగాయని తెలిసిందే.
వైద్య పరీక్షల్లో భాగంగా వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత మరోసారి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని యశోద వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న గురు, శుక్రవారా ల్లో వైద్య పరీక్షల నిమిత్తం మరోసారి యశోద హాస్పటల్కు కేసీఆర్ వెళ్లనున్నారని తెలుసింది. పూర్తి ఆరోగ్యం తో ఉన్న కేసీఆర్ వైద్య పరీక్షల నడు మ విరామ సమయంలో గత రెండు రోజులుగా పార్టీ సీనియర్లతో రాష్ర్టం లో సాగునీరు, రైతులు, వ్యవసా యం, తదితర ప్రజా సమస్యల మీద చర్చిస్తూ సమాచారం తీసుకుంటూ త దనుగుణంగా సూచనలిస్తున్నారు.