9 May, 2026 | 11:53 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

యెమెన్‌లో కేరళ నర్సు ఉరిశిక్ష వాయిదా

15-07-2025 02:10 PM

న్యూఢిల్లీ: భారత్ కు చెందిన కేరళ నర్సు నిమిషా ప్రియ(Kerala nurse Nimisha Priya) ఉరిశిక్షను యెమెన్ అధికారులు వాయిదా వేసినట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ, జూలై 16న జరగాల్సిన కేరళకు చెందిన ఉరిశిక్షను ఇప్పుడు నిలిపివేసినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. యెమెన్ లో  కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. యెమెన్ లోని స్థానిక జైలు అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నామని ఎంఈఏ ప్రకటించింది. ఇరువర్గాలకు ఆమోదయోగ్య పరిష్కార సాధనకు మరింత సమయం కోరామని ఎంఈఏ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం బుధవారం నిమిష ప్రియ ఉరిశిక్ష అమలు కావాల్సిఉంది. నిమిష ప్రియ విషయంలో విదేశాంగ శాఖ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.