16-11-2025 12:51:08 AM
-ఇక మన ఓట్లు .. బీసీలకు వేసుకుందాం
-గ్రామ గ్రామాన బీసీ సైన్యం సిద్ధం కావాలి
-ప్రభుత్వాల మెడలు వంచి 42 శాతం రిజర్వేషన్ సాధిస్తాం
-కామారెడ్డి బీసీ ఆక్రోశ సభలో వక్తలు
కామారెడ్డి, నవంబర్ 15 (విజయ క్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధి స్తామని 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి చైర్మన్, రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీసీ ఆక్రోశ సభకు జస్టిస్ ఈశ్వరయ్యతో పాటు 42 శాతం రిజర్వేషన్ల సాధన సమితి రాష్ట్ర అధ్య క్షుడు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ హాజరై మాట్లాడారు.
భవిష్యత్తు బీసీలదే అని, ఇక మన ఓట్లు ఓసీలకు కాదు.. బీసీలకే వేసు కుందామని చెప్పారు. అందుకు గ్రామ గ్రా మాన బీసీ సైన్యాన్ని సిద్ధం చేయాలని, ఉద్య మాన్ని ఉధృతం చేస్తే కాంగ్రెస్, బీజేపీలు మెట్టు దిగివచ్చి 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాయని చెప్పారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చి న 21 బీసీ అంశాలను రేవంత్రెడ్డి కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమం వలె బీసీ ఉద్య మం నిర్మిస్తామని చెప్పారు. బీసీలలో ఐక్యత అత్యంత అవసరమన్నారు.అగ్రవర్ణాలు బీసీలను కించపరుస్తున్నారని విమర్శించారు. అన్ని జిల్లాలు తిరుగుతామని, బీసీలకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తామని పేర్కొ న్నారు. బీసీల శత్రువులను గుర్తించాలని, రెడ్డి, వెలమ, కమ్మలకు వీఆర్ఎస్ ఇవ్వాలన్నారు.
బాక్వర్డ్ క్లాసెస్ పేరుతో రిజర్వేషన్లను 40 ఏళ్ల కింద అడ్డుకున్నారని, బీసీ కులాలని పేర్కొం టే ఎప్పుడో రిజర్వేషన్లు బీసీలకు దక్కేవని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మోసం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. బీజేపీలోని అగ్రవర్ణాల నేతలు రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అగ్రవర్ణ మీడియా బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
తెలంగాణలో సినిమాల్లో సాంస్క ృతిక అరాచకం పెరిగిందన్నారు. మూడు లక్షల కోట్ల బడ్జెట్ రావాలనీ ఒక్క శాతం కూడా ఇవ్వలేదన్నారు. బీసీలు ఎంగిలి మెతుకులకు ఆశపడొద్దని, ఆధిపత్య కులాల కుట్రలను ఎదిరించాలనీ బీసీలు ఐక్యంగా పోరాటాలు చేపట్టాలన్నారు. మేమెంతో మాకు అంత వాటా కావాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రెడ్డిల ఆధిపత్యం పరాకాష్టకు చేరిందని విమర్శించారు.
కామారెడ్డికి కిష్టయ్య పేరు పెట్టాలి
కామారెడ్డికి కానిస్టేబుల్ కిష్టయ్య పేరు పెట్టాలని, రంగారెడ్డికి పండుగ సాయన్న జి ల్లా పెట్టాలని సభలో తీర్మానించారు. రాజ్యాంగంలోని తొమ్మిది షెడ్యూల్లో చేర్చి, అనంత రం స్థానిక సంస్థలను 42 శాతం రిజర్వేషన్లకు నిర్వహించాలన్నారు. బీసీలకు ఆక్రోశం తర్వా త విప్లవం వస్తుందని, విప్లవం తర్వాత రా జ్యాధికారం దక్కుతుందన్నారు. రాజ్యం కోసం బీసీలు యుద్ధం చేయాలన్నారు. రేవంత్రెడ్డివి తుంటరి చర్యలని విమర్శించారు.
రాజ్యాధికారం కోసమే అగ్రవర్ణాలు పూజలు, గుడి రాజకీయాలు చేస్తున్నారని, బీసీలు కూడా రాజ్యాధికారం కోసం గుడి రాజకీయా లు చేయాలన్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కావాలని ఎంపీసీ బోర్డు ఏర్పాటు చేయాలని కామారెడ్డి డిక్లేషన్ సభలో ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. తమిళనాడు తరహా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి బి సి రిజర్వేషన్ అమలు పరచాలని సభ తీర్మానించిం ది.
42% బిసి రిజర్వేషన్లకు చట్ట ప్రకారం రో డ్ మ్యాప్ తయారుచేసి అమలుపరచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో 42శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ప్రతినిధులు మర్కంటి భూమన్న, ఎంజి వేణుగోపాల్ గౌడ్, ఖ్యాతం సిద్ధిరాములు, బాలా అర్జున్గౌడ్, సుమిత్రానంద్, చాకలి రాజయ్య, లలిత, పుట్ట మల్లికార్జున్, డాక్టర్ రమేష్ బాబు, హరికిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.