13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలతో పతంగులు

14-01-2026 01:26 AM

అభిమానాన్ని చాటుకున్న ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మరోసారి తన అభిమానాన్ని చాటుకు న్నారు. పండుగ వాతావరణంలో రాజకీయ సందేశాన్ని వినూత్నంగా ప్రజలకు చేరవేయడంలో ముందడుగు వేశారు. సంక్రాంతి పుర స్కరించుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం ధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఫొటోలతో ప్రత్యేకంగా పతంగులను తయారు చేయించారు.

గతంలో నూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశం తో ’రైజింగ్ తెలంగాణ’ పేరుతో పలు వినూత్న కార్యక్రమాలను నిర్వహించి మెట్టు సాయికుమార్ గుర్తింపు పొందారు. తాజా పతంగుల కార్యక్రమం కూడా అదే కోవలో ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆయనకు పలువురు కాంగ్రెస్ నేతలు, పార్టీ కార్యకర్తలు, మిత్రులు అభినందనలు తెలియజేశారు.