2 May, 2026 | 8:58 PM

Breaking News

ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •  

కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు

27-07-2025 01:37 AM

కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి, మంత్రులు, నాయకులు, ఐఎఎస్‌లు, పోలీసులు ఎవర్ని వదలకుండా కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కు మార్‌రెడ్డి మండిపడ్డారు. పోలీసులు, అధికారులపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడతుంటే తెలంగాణ ప్రజలు తలవంచుకునేలా ఉందన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు పనిచేసింది ఇదే పోలీసులు అన్న విషయాన్ని మరిచిపోతున్నారని ఆయన మండిపడ్డారు.

శనివారం కంభం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ  తమ హయాంలో పోలీసులు, అధికారులను మెచ్చుకున్న కేటీఆర్, ఇప్పుడు దూషిం చడమేంటన్నారు. అసెంబ్లీలో చిత్తుగా ఓడిపోయినా? పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్‌ను జీరో చేసినా.. అవినీతి డబ్బుతో కేటీఆర్‌కు అహంకారం మరింత పెరిగింద న్నారు. కుటుంబంలో గొడవలతో కేటీఆర్ అసహనంలో ఉన్నాడని, ఒకవైపు చెల్లె, మరో వైపు బావ హరీశ్‌రావు చికాకు పెడుతున్నారని ఆయన తెలిపారు.