calender_icon.png 20 June, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిటన్ పర్యటనకు కేటీఆర్

20-06-2025 01:07:17 AM

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూ నివర్సిటీలో ‘ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం’ శుక్ర, శనివారాల్లో నిర్వహించనున్న సదస్సులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.

వాకి ఆహ్వానం మేరకు గురువా రం కేటీఆర్ యూకే బయల్దేరి వెళ్లారు. ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికత అవసరం’ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడుల ఆవశ్యకత, పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడనున్నారు.